మందమర్రి, జూన్ 11: మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైపు నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఘోరక్పూర్ ఎక్స్ప్రెస్ మందమర్రి పట్టణంలోని టోల్ప్లాజా సమీపంలో నిలిచిపోయింది. భద్రాచలం వెళ్లాల్సిన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ కూడా ఆగింది. వెంటనే స్పం దించిన రైల్వే అధికారులు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. సుమారు 4 గంటలపాటు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిసింది.