హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాజభవన్, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గౌడ్స్ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం మానుకోవాలని సూచించారు. టివోలీ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చేవారు నిర్ణీత సమయానికంటే ముందుగానే చేరుకోవాలని సూచించారు. సభ కారణంగా పరేడ్ మైదానం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో అన్ని రహదారులు రద్దీగా ఉంటాయని, అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.
సభ అనంతరం ప్రధాని మోదీ.. రాజ్భవన్కు చేరుకుంటారు. నేడు అక్కడే బస చేయనున్నారు. దీంతో రాజ్భవన్ రోడ్డును రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు.