హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అలాగే కొనసాగించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారి డిప్యుటేషన్లను రద్దుచేసి, సొంత యూనిట్లకు బదిలీ చేయాలంటూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సంస్థ ఎండీ వై నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
విద్యా సంవత్సరం మధ్యలో సిబ్బంది బదిలీల వల్ల పిల్లలకు ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేయడంతో ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేశారని నేతలు వెల్లడించారు.