హైదరాబాద్ : నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శనివారం రాకొండ గ్రామంలో వద్ద టాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను ఉప్పునుంతల మండలం వాసులు మల్లయ్య, రేణమ్మ, బాలస్వామిగా గుర్తించారు. మల్లయ్య, రేణమ్మ భార్యభర్తలు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.