మహబూబాబాద్ : వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేటల మధ్య తొర్రూరు మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2006 లో తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడింది. అంతకు 30 ఏండ్ల ముందే వర్తక సంఘంగా, తర్వాత మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తొర్రూరు ఏర్పడిందన్నారు.
సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ ఇవ్వాళ 380 మంది సభ్యులతో విస్తరించిందన్నారు. తొర్రూరు ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షులు, tsiidc చైర్మన్ అమరవాది లక్ష్మీ నారాయణ, తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్, ప్రధాన కార్యదర్శి బొనగిరి శంకర్, కోశాధికారి చిడురాల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.