హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల్లోని జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు, చేర్పుల కోసం విధించిన గడువు రేపటి (సోమవారం)తో ముగియనున్నది. ఈ మేరకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వెల్లడించింది. గురుకుల జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ మే 17వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 14వ తేదీ నుంచి ఎడిట్ ఆప్షన్ను కల్పించింది. ఆ గడువు సోమవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.