హైదరాబాద్: మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధిక స్థానాలను దక్కించుకునేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసింది. ఇక అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ పార్లమెంటు బరిలో నిలిచే అభ్యర్థుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. దీనికోసం గాంధీభవన్లో ప్రత్యేకంగా ఓ కౌంటర్ను కూడా ఏర్పాటు చేసింది. శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇందులో భాగంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం (Malkajgiri MP) నుంచి పోటీ చేసేందుకు టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) నేడు దరఖాస్తు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.