పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో విషాదం నెలకొంది. తాటి చెట్టు మీద నుంచి పడి కల్లు గీత కార్మికుడు ఏరుకొండ తిరుపతి గౌడ్(35) మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారడంతో పక్కనే బావిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగిపోవడంతో తిరుపతి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చివరకు బావిలో తిరుపతి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి గౌడ్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.