హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అభిమాన నేత, సీఎం కేసీఆర్ను చూసేందుకు ఏపీకి చెందిన ఓ దివ్యాంగ చిత్రకారుడు మంగళవారం నుంచి సైకిల్యాత్రపై బయలుదేరి రానున్నాడు. సీఎం కేసీఆర్ను కలిసి, తాను గీసిన చిత్రరాజాన్ని ఆయనకు అందిస్తానని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ తన అభిమాన నాయకుడిని చూడటంతో పాటు, సమాజంలో మహిళలు ఎదురొంటున్న సమస్యలపై సామాజిక అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. సెప్టెంబర్ 6 వరకు హైదరాబాద్ చేరుకుంటానని వెల్లడించారు.