హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఆ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్రెడ్డి తెలిపారు. ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించి, గడువు దాటాక వాయిదా వేశారు.