హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారం ముగియనున్నది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న నిర్వహిస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు, దరఖాస్తు చేసేందుకు tsrdccet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి. ఇదిలావుండగా, బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు కూడా సోమవారం వరకే దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో చేరేందుకు mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.