హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 16,604 మంది అభ్యర్థులు అటెస్టేషన్ పత్రాలను డిజిటల్గా పూరించి.. డౌన్లోడ్ చేసుకొనేందుకు మంగళవారం తుది గడువు అని టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు తెలిపారు. డౌన్లోడ్ చేసుకొన్న ధ్రువీకరణ పత్రాలపై పాస్పోర్టు సైజు ఫొటోలు అతికించి, మూడు సెట్లపై గెజిటెడ్ అధికారులతో సంతకాలు చేయించాలని సూచించారు. ఇప్పటికే సంతకాలు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ నెల 12, 13న ఆయా జిల్లాలో కేటాయించిన నిర్ణీత కార్యాలయాల్లో అందజేయాలని తెలిపారు.