హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరగనున్నది. అన్ని కులసంఘాలకు స్థలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ల కోసం ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాలు కేటాయించడంతోపాటు నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డితోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, క్రిస్టియన్ పెద్దలు, బిషప్లు పాల్గొనున్నారు.