హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ విశ్రాం త ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తొలుత జలసౌధలో విశ్రాంత ఇంజినీర్ విద్యాసాగర్రావు విగ్రహానికి నివాళులర్పిస్తారు. విశ్వేశ్వరయ్య భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు డిసిషన్ సపోర్ట్ సిస్టమ్పై రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు, గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ అధ్యయన అంశంపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం సాగునీటి రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఇంజినీర్లకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్ అవార్డులు అందజేస్తారు. జగిత్యాల చీఫ్ ఇంజినీర్ కే సుధాకర్రెడ్డి, ఇంటర్స్టేట్ వాటర్ రిసోర్స్ విభాగం సీఈ కోటేశ్వర్రావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ ఎం నీలిమ ఉత్తమ ఇంజినీర్ అవార్డులు అందుకోనున్నారు.