హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్రెడ్డిని, మంత్రి పొన్న ప్రభాకర్ను శుక్రవారం సచివాలయంలో టీఎన్జీవో కేంద్రం సంఘం నేతలు వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేస్తామని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, ముజీబ్ హుస్సేని, పర్వతాలు, శంకర్ తదితరులు ఉన్నారు.