హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టకపోతే ఆ పార్టీని శాశ్వతంగా బొందపెడతామని హెచ్చరించారు. శనివారం హైదరా బాద్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మనువాద ముసుగులో దళితులను గుడులకు, బడులకు దూరం చేసిన చరిత్ర బీజేపీదేనని మండిపడ్డారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యామని ధ్వజమెత్తారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు. దళితులకు బీజేపీ ప్రధాన శత్రువని, ఓటుతోనే ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకట్, వరింగ్ ప్రెసిడెంట్ చందు, ప్రధాన కార్యదర్శులు తిరుమలేశ్, ధర్మారపు శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు నాగరాజు, కిరణ్, శ్రీకాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.