హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది.
వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నాయని తెలిపింది. మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 24న 10 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నది. లక్కీడిప్లో టికెట్లు పొందినవారు రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.