హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.5 కోట్లు విరాళంగా అందాయి.
ఓ భక్తుడు శుక్రవారం సంబంధిత చెక్కులను అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని టీటీడీ అధికారులను కోరారు. తన వివరాలను తెలిపేందుకు దాత నిరాకరించారు.