హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.