దామరచర్ల, అక్టోబర్ 1 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేయాలని టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అధికారులను ఆదేశించారు. గడువులోపే పూర్తిచేసి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని సూచించారు. శనివారం ఆయన ఆర్ఈసీ సీఎండీ వివేక్కుమార్ దేవాంగ్, పీఎఫ్సీ సీఎండీ రవీందర్సింగ్ జిలానీ, ఈడీఆర్ఈసీ సంజయ్ శ్రేష్టతో కలిసి నాలుగు వేల మెగావాట్ల పవర్ జనరేషన్కు సంబంధించిన ఐదు ప్లాంట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పవర్ జనరేషన్, చిమ్నీలు, కూలింగ్ టవర్లు, యాష్ ప్లాంటు, రైల్వే నిర్మాణ పనులు, ఉద్యోగుల క్వార్టర్స్, రిజర్వాయర్ తదితర నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ ఏడీ మురళి, టీఎస్ జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానందం, రమేశ్, సీఈ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.