కొత్తగూడెం: భద్రదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో పులి కలకలం సృష్టిస్తున్నది. ఆళ్లపల్లి మండలంలోని ఉడుముల గుట్ట అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నది. పులి పాదముద్రలను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
కాగా, అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్న నేపథ్యంలో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. అయితే పులిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని సమీప గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గత నవంబర్లో టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్లో పెద్దపులి కనిపించింది. మోట్లగూడెం సమీపంలోని జంగాలపల్లి గేట్ వద్ద నవంబర్ 18న పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ అధికారులు, ట్రాక్టర్ డ్రైవర్లు చూశారు. పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ సిబ్బంది వీడియో తీశారు.