అచ్చంపేట, జూలై 4: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులి కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరాహాబాద్ అటవీప్రాంతంలో పర్యటిస్తుండగా పెద్దపులి కనిపించింది. పెద్దపులి రోడ్డు దాటి గుండం రోడ్డు పక్కన కాసేపు ఆగి అడవిలోకి వెళ్లిపోయిందని అమ్రాబాద్ ఎఫ్డీవో రోహిత్ తెలిపారు. పులిపేరు పహారా అని, రెండేండ్ల వయస్సు అని పేర్కొన్నారు. ఫరాహాబాద్ టైగర్ సఫారీ, పర్యాటకుల సందర్శనను మూడు నెలలపాటు నిలిపేవేస్తున్నట్టు సీసీఎఫ్ ఫీల్డ్ డైరెక్టర్ ఏటీఆర్ శ్రీనివాసులు, ఐఎఫ్ఎస్ డీఎఫ్వో కిష్టాగౌడ్ సోమవారం తెలిపారు.
భూపాలపల్లి అడవుల్లోకి మళ్లీ పులి
కవ్వాల్ అటవీ ప్రాంతానికి వెళ్తుందని అధికారులు భావించిన పెద్దపులి మళ్లీ భూపాలపల్లి అడవుల వైపే వచ్చినట్టు తెలుస్తున్నది. ఇటీవల కొయ్యూరు అటవీ రేంజ్లోని బొగ్గులవాగు ప్రాజెక్టు, చెల్పూర్ రేం జ్లోని టేకుమట్ల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి.. పెద్దపల్లి జిల్లా మంథని అడవుల మీదుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్కు వెళ్తుందని అధికారులు చెప్పారు. అయితే సోమవారం భూపాలపల్లి అటవీ రేంజ్ పరిధిలో బస్వాపూర్, మేడిపల్లి బొగ్గులవాగు అటవీ ప్రాంతం వైపు పులి వచ్చిందని, సోమవారం దాని పాద ముద్రలు గుర్తించినట్టు భూపాలపల్లి అటవీ రేంజ్ అధికారి నరేశ్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.