హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణం చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న యువతిని దుండగులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారు. యువతిని ఢీకొట్టి అక్కడినుంచి పరారయ్యారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు దవాఖానకు తరలించారు. బాధితురాలి తలకు బలమైన గాయమైందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి పేరు సుమియా బేగం అని, టైలరింగ్ శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదమా? హత్యాయత్నమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారులో ఉన్నవారిని గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. ప్రేమించిన వ్యక్తే యువతిని హత్య చేయడానికి యత్నించాడని స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. pic.twitter.com/JXxKoE2Krj
— Namasthe Telangana (@ntdailyonline) July 7, 2022