దామరగిద్ద, జనవరి 13: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి, వత్తుగుండ్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాయని, వాటిలో పెద్దదైన చిరుత అనారోగ్యంతో బాధపడుతూ అడవి నుంచి బయటకు వచ్చి శనివారం పొలాల వెంట ప్రత్యక్షమైందని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిరుతను స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసినా.. తనకేమీ పట్టనట్టు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ రేంజ్ అధికారి సంతోశ్, ఎస్సై శ్రీనివాస్రావు అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన చిరుతకు చికిత్స అందించే క్రమంలో చనిపోయిందని వారు తెలిపారు. ఇంకా రెండు చిరుతల కోసం గాలిస్తున్నామని, అటవీ సమీప ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు.