Kondagattu Temple | జగిత్యాల : కొండగట్టు ఆలయంలో చోరీకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల నుంచి వెండి అంజన్న విగ్రహంతో పాటు 5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 10 కిలోల వెండి ఆభరణాలు.. మిగతా నలుగురి నిందితుల వద్ద ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆ నలుగురి కోసం నాలుగు పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను కర్ణాటకలోని బీదర్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.