వనపర్తి: వనపర్తి (wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా తేలారు. పట్టణంలో బండార్నగర్కు చెందిన మున్నా, అజ్మద్, భరత్.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. దీంతో పోలీసులు వారికోసం గాలింపు చేపట్టారు.
బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.