చార్మినార్, మే 27: హైదరాబాద్లోని సిటీ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి మరో మూడు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్లో మూడేండ్ల ఆనర్స్ డిగ్రీ, నాలుగేండ్ల ఆనర్స్ బయోటెక్నాలజీతో పాటు టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్లో మూడేండ్ల బీబీఏ కోర్సులను అందించనున్నట్టు చెప్పారు. మొదటి సారిగా ఈ 3 కోర్సులను సిటీ కాలేజీలో ప్రారంభిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.