హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ బిడ్డల కోసం రాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ త్రిసభ్య కమిటీని శుక్రవారం నియమించింది. ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి జస్టిస్ గీతామిట్టల్ అధ్యక్షురాలిగా ఉంటారు.
మణిపూర్లో ఉంటున్న తెలంగాణ విద్యార్థులు, పౌరులు తమ సమస్యల పరిష్కారానికి ఈ కమిటీని సంప్రదించాలని కోరింది. బాధితులు, వారి తరఫున ఎవరైనా తమకు సమస్యలు విన్నవించవచ్చని పేర్కొన్నది. మరిన్ని వివరాలకు 040-23446725, లేదా 9440621436 నంబర్కు, telenganaslsa@gmail.com మెయిల్లో సంప్రదించాలని కోరింది.