హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, ఆయా సంఘాల ప్రతినిధుల వినతులను పరిశీలించి, పరిషరించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యలను సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పలు వినతులను అందజేశాయి.