Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలోని టైల్స్ కూలీలపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.