హనుమకొండ: హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఖాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో టిప్పర్ బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను తోకల ముకేశ్, చందు, జార్ఖండ్కు చెందిన ఎండీ ఆఖిమ్గా గుర్తించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాధానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.