హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. దీనికి ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షంపడుతుందని చెప్పింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, జయశంకర్, నల్లగొండని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం రికార్డయ్యింది.