హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ముగ్గురు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో 2021లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్), ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్(ఐసీజేఎస్) ప్రాజెక్టుల అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసు సిబ్బందికి కేంద్ర హోంశాఖ ఈ అవార్డులు ప్రకటించింది. సీసీటీఎన్ఎస్ విభాగంలో ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ ఎస్సై ఉయ్యాల రమేశ్, టప్పాచబుత్ర పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ బన్న సంధ్య, నిర్మల్ జిల్లా బాసర పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ దొడ్ల అన్వితకు అవార్డులు లభించాయి.