హైదరాబాద్: క్రిప్టోకరెన్సీ (cryptocurrency) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. వారినుంచి చెక్బుక్లు, ఆరు ఏటీఎం, మరో ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమబెంగాల్కు చెందిన చోటా భాయ్.. అదే రాష్ట్రంలోని సిలిగురికి చెందిన బ్యాంక్ ఉద్యోగితో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. కమీషన్ పేరుతో 64 బ్యాంకు ఖాతాలు సేకరించారు. అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పి 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో ఆన్లైన్లో పెట్టుబడులు సేకరించారు. ఈ క్రమంలో నాంపల్లికి చెందిన వ్యక్తి నుంచి రూ.86 లక్షలు వసూళు చేశారు. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.