బంజారాహిల్స్, ఆగస్టు 24: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సుమంత్తో పాటు అరుణ్కుమార్రెడ్డి, కార్తీక్, మహేందర్రెడ్డి తదితరులు తనపై గత నెల 31న దాడి చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో సుమంత్తో పాటు ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో తాజాగా నిందితులు అరుణ్కుమార్రెడ్డి, మహేందర్రెడ్డి, కార్తీక్ను ప్రకాశం జిల్లా మార్టూరు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుమంత్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్నది.