యాదాద్రి, జూలై 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. ఆదివారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. యాదాద్రీశుడి సన్నిధిలో లక్ష్మీనృసింహుడికి నిత్యోత్సవాలు కొనసాగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను హారతితో కొలిచారు. స్వామివారి హుండీకి రూ.24,31,166 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. స్వామివారి స న్నిధిలో పలువురు విద్యార్థినులు నిర్వహించిన భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకొన్నాయి.