హైదరాబాద్, సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28, 29న దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెపై శుక్రవారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఉద్యోగ సంఘం నేతలు సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కోశాధికారి శ్రీనివాసన్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిష్రెడ్డి, తిరుపతయ్య, సంయుక్త కార్యదర్శులు ఎల్ మద్దిలేటి, గిరిధర్, గణేశ్ తదిరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు ప్రకటించింది. సమ్మెలో తాము కూడా పాల్గొంటామని ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఎం థామస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీకి గొడ్డలిపెట్టుగా మారిన ప్రజారవాణ బిల్లును ఉపసంహరించుకోవాలని, బల్క్ డీజిల్కు సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.