హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిందని, దేశ చరిత్రలో ఇదే భారీ ఉద్యోగ భర్తీ నిర్ణయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 91,142 వేల పైచిలుకు కొత్త ఉద్యోగాల భర్తీ చేసే ప్రక్రియకు సీఎం కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టారన్నారు.
దేశ చరిత్రలోనే ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు అని, ఇంత భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాల భర్తీ చేసే నిర్ణయం గతంలో దేశ వ్యాప్తంగా ఎక్కడా జరగలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరుద్యోగుల ఆషాకిరణం అని ఆయన అన్నారు. కొత్త ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులు బాగా చదువుకోవాలని సూచించడంతో పాటు యువతీ, యువకులకు శుభాకాంక్షలు తెలిపారు.