హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం మియ్యపురంలో ప్రాచీన ఆలయాన్ని కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బైరోజు శ్యాంసుందర్ ఆదివారం పరిశీలించారు. ఈ ఆలయం 6 లేదా 7వ శతాబ్దానికి చెందినది. వీరశైవాచార్యులుగా, వీరశైవ కవీశ్వరులుగా పేరుపొందిన పండితారాధ్యుల శిష్యురాలు సత్తెమ్మ దీనిని కట్టించారని ప్రసిద్ధి. గుడిలోని శిల్పాలన్నీ బాదామీ చాళుక్యుల కాలం, శైలికి చెందినవని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. నగ్నకబంధ, శైవద్వారపాలకులుగా మహాకాళుడు, నంది (ఆలంపూర్ శిల్పాలను పోలినవి), పద్మనిధి, శంఖనిధులు, గజ లక్షులు వంటి శిల్పాలున్నాయని తెలిపారు.