హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చేస్తారు. మే నెలలో సాంకేతిక కారణాలతో అదనపు బియ్యం పంపిణీ చేయలేకపోయారు.
పొర్టిఫైడ్ రైస్ అందించే జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్లోనూ పొర్టిఫైడ్ రైస్తోపాటు అదనపు కోటా బియ్యం కూడా పంపిణీ చేయనున్నారు.