అడుగున ఉన్న వస్తువులు కూడా పైకి కనిపించేంత స్వచ్ఛమైన నీరు.. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రదేశం.. కొండపైకి వెళ్లకుండానే పుణ్య స్నానమాచరించేందుకు ఏర్పాట్లు.. ఇదీ యాదగిరిగుట్టలోని ‘లక్ష్మీపుష్కరిణి’ ప్రత్యేకతలు.
కొండ కిందే పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. పుష్కరిణి గుండంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు నాలుగు ఫిల్టర్ యంత్రాలను బిగించారు. బ్యాలెన్సింగ్ ట్యాంకు, నీటి సంపులను నిర్మించారు. శుద్ధి చేసిన నీరు గుండం చుట్టూ మెట్లు, మండపాలకు బిగించిన దాదాపు 300 నల్లాల ద్వారా నీళ్లు గుండంలోకి వెళ్తున్నాయి.
-యాదాద్రి