హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరింది. నది ఉధృతంగా ప్రవహిస్తు్న్నందున పరీవాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. వరద పోటెత్తుతుండడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.