బాన్సువాడ, అక్టోబర్ 9 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిజామామాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లికి చెందిన మాదిగ దండోరా సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ మేరకు సోమవారం తీర్మాన ప్రతిని బాన్సువాడలో స్పీకర్కు అందజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు స్పష్టం చేశారు.