హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): డెంగ్యూసహా ఇతర సీజనల్ వ్యాధుల నియంత్రణకు తమ ఇండ్లలోని పరిసరాల పరిశుభ్రతకు అం దరూ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని నియంత్రణకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల (పీపీపీ) కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో చట్టసభ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వార్డు కమిటీల సభ్యులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి ఇండ్లలోని కుండీలు ఇతర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేశారు. సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తన నివాసంలో పూల కుండీలు, ఇతర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22,660 మంది పీపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారని మున్సిపల్శాఖ కు వివిధ మున్సిపాలిటీలు, నగర పాల క సంస్థలు నివేదించాయి. వీటిలో 1,924 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, మేయర్లు, చైర్మన్లు, కా ర్పొరేటర్లు, కౌన్సిలర్లు, 1,106 మంది అధికారులు పాల్గొన్నారు. 7,662 మంది వార్డు కమిటీసభ్యులు, సీనియర్ సిటిజన్లు, మహిళా కమిటీ సభ్యు లు పాల్గొన్నారు. 6,399 మంది స్వ యం సహాయక సంఘాల సభ్యులు, 5,569 మంది వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.