న్యూఢిల్లీ, మే 9: కరోనా మహమ్మారి జన్యుక్రమాన్ని మార్చుకొంటూ మానవాళిపై విరుచుకుపడుతున్న వేళ దానికి అడ్డుకట్ట వేయడానికి కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ఈ రెండే ప్రధాన ఆయుధాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకొన్నా కూడా భవిష్యత్తులో వచ్చే వేవ్ల నుంచి తప్పించుకోవాలంటే కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరని ఢిల్లీలోని జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రల్ బయాలజీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.