న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా మంగళవారం (మార్చి 1) నుంచి పలు నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిలో బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పు, ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ తప్పనిసరి వంటివి ఉంటాయి.
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి.
ఇండియన్ బ్యాంక్ వినియోగదారులు ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు విత్డ్రా చేసుకోలేరు. ఈయితే వారు బ్యాంక్ కౌంటర్ నుంచి డైరెక్ట్గా వీటిని పొందే వీలుంటుంది.
టోల్ప్లాజాల నుంచి ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాలంటే వాహనదారులు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పేర్కొన్నది.
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు విలీనమైన నేపథ్యంలో.. ఈ రెండు బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారనున్నాయి. పాత కోడ్తో లావాదేవీలు చేయలేరు. వీటితో పాటు ఈ నెల 10తో ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్ రేట్లను సవరించే అవకాశమున్నట్టు ఆ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.