హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తానెక్కడా రాజ్భవన్ను డీ గ్రేడ్ చేసేలా మాట్లాడలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం స్పందించనని వెల్లడించారు. వర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లుపై గవర్నర్తో చర్చించాలని సీఎం నుంచి ఆదేశాలందాయని, ఈ మేరకు గవర్నర్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని మంత్రి తెలిపారు. రాజ్భవన్, గవర్నర్పై గౌరవం ఉంది కనుకనే అపాయింట్మెంట్ కోరామని, అయితే ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి స్పష్టం చేశారు.