హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ ఇవాళ కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ సంస్థ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. టీకాలపై అవగాహన లేని వారు కోవాగ్జిన్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. కోవాగ్జిన్ తయారీ కోసం తమపై ఎటువంటి వత్తిడి లేదని ఆ సంస్థ తెలిపింది. సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్ను తయారు చేసేందుకు మాత్రమే తాము వత్తిడికి గురైనట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఎంతో అధ్యయనం తర్వాత కోవిడ్19 వ్యాధికి కోవాగ్జిన్ టీకాను తయారు చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
#Bharatbiotech #announcement #Vaccine #Covaxin #covid19 #vaccinesafety #healthcare #immunisation #vaccineforall pic.twitter.com/nNwmOuSldw
— BharatBiotech (@BharatBiotech) November 17, 2022
కోవాగ్జిన్ టీకాపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇవాళ ప్రకటన చేసింది. రాజకీయ వత్తిళ్ల వల్లే కోవాగ్జిన్ టీకాను వేగంగా అభివృద్ధి చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. శాస్త్రీయ పద్ధతిలో, నిర్దేశిత నియమావళి ప్రకారమే కోవాగ్జిన్ కోవిడ్ టీకాను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.