బండ్లగూడ, జూలై 12: అది రంగారెడ్డి జిల్లా గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్రోడ్. ఉదయం ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వెళ్లి చూడగా ఐదేండ్ల ఓ పాప కారు(టీఎస్07 జీపీ 7450) డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో కారును పక్కకు ఆపించారు. వెంటనే ఆ పాప “అంకుల్.. మా తాత ఎస్సై” అంటూ చెప్పింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పక్క సీట్లో కూర్చు న్న గంధంగూడకు చెందిన తాత తిరుపతిని ప్రశ్నించగా ఆటోమెటిక్ కారు అని, కంట్రోల్ తన చేతిలోనే ఉందంటూ సమర్థించుకున్నాడు.
దీంతో ప్రజలు అతనిపై మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారికి కారు ఇచ్చిన వ్యక్తిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సై అని సమాచారం. ఈ కారుపై ఇప్పటికే ఆరు చలానాలు ఉండగా మూడు ఓవర్స్పీడ్ చలానాలు. మొత్తంగా రూ.4,010 జరిమా నా చెల్లించాల్సి ఉన్నది.