హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెలలో అల్పపీడనాలు, వాయుగుండాలు చాలా కిందకు ఏర్పడుతాయని నిపుణు లు తెలిపారు. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేం ద్రం హెచ్చరించింది. దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ 9వ తేదీ వరకు భారీ వర్షా లు కురుస్తాయని, 9న ఆదిలాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మంగళవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది.
హిమాలయాల వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 15 నుంచి మొదలవుతుందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవాల ద్రోణి మధ్య భారతంలో కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి అక్టోబర్ రెండోవారంలో తిరోగమించే అవకాశం ఉన్నదని చెప్పారు. శాస్త్రవేత్తల అం చనాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉన్నది.
మంజీరా నదిపై వానమబ్బు ల కాంతి పుంజం కనువిందు చేసింది. సుడిగాలి కెరటమై నింగికి ఎగిసింది. మంజీరా తరంగం ఆకాశానికి ఎగసిందా? లేక ఆకాశ గంగ భువికి దిగివచ్చిందా? అన్నట్టు హో యలొలికించిన ఈ దృశ్యం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జిపల గ్రామ సమీపం లో సోమవారం ఆవిష్కృతమైంది. ఆ సమయంలో ఆకాశాన కారుమబ్బులు కమ్ముకొన్నాయి. అంతలోనే మంజీరా నదిలో సుడిగాలి రేగింది. గింగిరాలు తిరుగుతూ ఆకా శం నుంచి నదిలోకి తెల్లని ధారలా ఏర్పడింది. టోర్నోడోను తలపించిన ఈ సుడిగాలి కెరటం మంజీరానది ఉపరితలం నుం చి 7 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసింది. మధ్యా హ్నం 1.15 నుంచి గంటసేపు అలాగే ఉండిపోయింది. దీనిని క్యుములోనింబస్ మేఘంగా వాతావరణశాఖ పేర్కొన్నది. ఆ సమయంలో వేడి వాతావరణం ఎక్కువగా ఉండటంతో ఈ దృశ్యం ఆవిష్కృతమైనట్టు నాగరత్న తెలిపారు.